Thursday 17 September 2015

వినాయక చవితి శుభాకాంక్షలు...

“సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజ కర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్న రాజో గణాధిపః
ధూమ్ర కేతుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
వక్రతుండఃశూర్పకర్ణ: హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నః తస్య నజాయతే.”

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు...

Wednesday 16 September 2015

హరితాళిక గౌరీ వ్రతం...

హరితాళిక గౌరీ వ్రతం: ( 16-09-2015, బుధవారం )

కైలాస శిఖరంలో పార్వతి ఒకనాడు పరమశివుడిని ఇలా అడిగింది “స్వామీ! తక్కువ శ్రమతో, ధర్మాచరణతో ఎవరు నిను భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారికెలా ప్రసన్నుడవౌతావో తెలుపుమని ప్రార్థించింది. అంతేకాక, జగవూత్పభువైన మీరు నాకు యే తపోదానవ్రతమాచరించడం వల్ల లభించారు” అని అడిగింది.ప్రసన్నవదనంతో పరమశివుడు ‘‘దేవీ! వ్రతాల్లోకి చాలా ఉత్తమమైంది, అత్యంత రహస్యమైన వ్రతమొకటున్నది. దాన్ని ఎవరు ఆచరించినా నేను వారికి వశుడనైతాను. భాద్రపద శుక్లపక్షంలో హస్తనక్షత్రంతో కూడిన తదియనాడు వ్రతాన్ని ఆచరించినవారు సర్వపాప విముక్తులవుతారు.

‘‘దేవీ! నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహా వ్రతాన్ని ఎలా ఆచరించావో చెబుతాను. విను!” అన్నాడు. భూలోకమున వివిధ పక్షులతో, విచిత్ర మృగాలతో మంచుచేత కప్పబడి బహుసుందరమైన హిమవత్ పర్వతము కలదు. హిమవంతుడా
ప్రాంతానికి ప్రభువు. నీవాతని కూతురువు.
చిన్నతనం నుంచే శివభక్తురాలవు. యుక్తవయసు వస్తున్న నీకు వరుడెవరో? అని హిమవంతుడు ఆలోచించగా, త్రిలోక సంచారి నారద మునీశ్వరులు ఒకనాడు మీ తండ్రి వద్దకు వచ్చాడు. అర్ఘ్య పాద్యాలందించి మీ తండ్రి నిను చూపి, ఈ కన్యని ఎవరికిచ్చి వివాహం చేయదలిచావు? తగిన వరుడెవరని నారదుని అడిగినాడు. వెంటనే నారదుడు ‘ఓ గిరిరాజా! నీ కన్యారత్నానికి అన్నివిధముల యోగ్యమైనవాడు బ్రహ్మాదిదేవతలలో విష్ణువు.

అతడు పంపితేనే నీ వద్దకు వచ్చానన్నాడు. సంతోషంతో హిమవంతుడు మునీంద్రా ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నిను పంపాడు కనుక గౌరవించి, అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలుపుమన్నాడు. నారదుడు అందుకు అంగీకరించి బయలుదేరాడు. హిమవంతుడు ఆనందంతో భార్యాపిల్లలకు ఆ విషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరకు పిలిచి “ఓ పుత్రీ! గరడవాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని” తెలిపెను. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్లి చాలా దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి ప్రియసఖి ఆమె మనసా పెండ్లికి సుముఖంగా లేదని తెలుసుకుని స్నేహితురాలికొక ఉపాయం చెప్పింది. నీ త్రండి జాడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరూ వనప్రాంతానికి ప్రయాణమైనారు. కుమార్తె కనిపించుటలేదని గిరిరాజు హాహాకారాలు చేసి, ఏడ్చి మూర్ఛిల్లాడు.

నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు
చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల పూజించావు. నీభక్తికి మెచ్చి సైకత లింగాన్ని (ఇసుక) చేసుకొని పూజిస్తున్న నీకు భాద్రపదశుక్ల తదియనాడు నేను ప్రసన్నుడైనాను. చెలికత్తెచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని ‘‘హరితాళిక వ్రతం” అంటారు. ఆరోజు శివరాత్రి వలె
ఉపవసించి, రాత్రంతా జాగరణతో ఎవరైనా
పరమశివుని సైకత లింగాన్ని పత్రపుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, సంపత్తులు కలుగుతాయి” అని పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు.

వ్రత విధానం:
16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని తోరాముగా చేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి. తెల్లవారి వినాయకచవితి రోజు దంపతులకు భోజన, వస్త్ర, దక్షిణ తాంబూలాలతో పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజించాలి. ముత్తైదువలంతా చవితి తెల్లవారుఝామున మేళతాళాలతో సైకత లింగరూపంలోని సాంబశివుని దగ్గరలోని జలాశయంలో నిమజ్జనం చేయాలని శివుడు పార్వతికి వివరించాడు.

Sunday 13 September 2015

పొలాల అమావాస్య...

( 13 - 09 -2015, ఆదివారం )

శ్రావణ మాసపు అమావాస్య నాడు జరుపుకునే పండుగనే పొలాల అమావాస్య అని అంటారు. ఈ రోజు మహిళలు పుణ్యమైన పొలాల అమావాస్య వ్రతమును ఆచరిస్తారు. ఆ వ్రత కథ ఇదిగో....

ఒకసారి కైలాసానికి వెళ్ళిన ఇంద్రాణిదేవి పార్వతీ దేవిని సత్పుత్రులను మరియు సకల శుభాలను కలిగించే ఒక వ్రతం గురించి తెలుపమని వేడుకుంది. అప్పుడు మాత పోలా అమావాస్య వ్రతం గురించి చెప్పింది.

పూర్వం శ్రీధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు.ఆయన భార్య సుమిత్ర.వారికి  ఎనిమిది మంది పుత్రులు.వారిలో పెద్దవాడి పేరు శంకరుడు,ఆయన భార్య విదేహ. ఈమెకు కలిగిన శిశువులందరూ పుట్టగానే మరణించేవారు. 

ఒకసారి శ్రీధరుడి తండ్రి శ్రాద్ధము ఆరంభమగుచుండగా విదేహ ఒక మృత శిశువుకు జన్మనిచ్చింది. మామగారి శ్రాద్ధం భంగమగునని కోడలు విదేహను ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అత్త సుమిత్ర బెదిరించింది. భయపడిన విదేహ మృత శిశువును తీసుకొని అడవిలో ఉన్న ఒక ఆలయంలోకి ప్రవేశించింది. మృతశిశువును ఆలయంలో ఉంచవద్దని ఆ దేవాలయ పాలకురాలు విదేహను ఆదేశించగా, భయపడ్డ విదేహ తన దీనగాథను ఆమెకు వివరించింది. దయామూర్తి అయిన ఆ దేవాలయ పాలకురాలు విదేహతో ఇలా అన్నది "అమ్మా విదేహ! నీ కష్టాలు త్వరలోనే దూరమవుతాయి. శ్రావణ మాసపు అమావాస్య నాడు ఈ ఆలయానికి 64 మంది దివ్య యోగినులు వచ్చి ఆ ఆదిపరాశక్తిని పూజించి వెళతారు. ఆ రోజున నీవు వారికి నీ కష్టాలను తెలియజేయి. వారు నీకు తప్పక సాయం చేస్తారు.వారు వచ్చే వరకు ఈ మారేడు పొదలో దాగుండు" అని తెలిపింది. ఇది విన్న విదేహ అలాగే చేసింది. శ్రావణమాస అమావాస్యనాడు మధ్యరాత్రి 64 యోగినులు ఆ దేవి పూజకు విచ్చేయగా, విదేహ వారు వచ్చే వరకు మారేడు పొదలో దాగి ఉంది.

పూజముగిసిన తర్వాత,అక్కడ మానవ గంధమును పసిగట్టిన యోగినులు విదేహను బయటకు రమ్మని పిలవగా, విదేహ బయటకువచ్చి తన కష్టాలను వారికి తెలుపగా, కరుణా సాగరులైన ఆ యోగినులు విదేహ కుమారులందరినీ బ్రతికించి ప్రతి సంవత్సరము శ్రావణ మాసపు అమావాస్యనాడు పోలా వ్రతం ఆచరించినచో నీకు తప్పక మంచి జరుగునని చెప్పి అంతర్థానమైయ్యారు.

సజీవులైన కుమారులతో విదేహ ఇంటికి రాగ భర్త, అత్తమామలు చాలా సంతోషించారు. అలా విదేహ ప్రతి యేటా శ్రావణ అమావాస్య నాడు పోలా వ్రతమును ఆచరించి సుఖసంతోషాలను పొందింది. కావున ఈ వ్రతాన్ని భూలోకాన శ్రావణ ఆమావాస్యనాడు ఎవరు ఆచరిస్తారో వారు సకల సుఖాలను అనుభవించి, సద్గతులు పొందుతారని పార్వతీ మాత ఇంద్రాణిదేవికి వివరించింది.

Thursday 10 September 2015

రామ రామ గోవింద....

రచన: శ్రీ త్యాగరాజ స్వామి.
రాగం: సౌరాష్ట్రం
తాళం: ఆది

పల్లవి:
రామ రామ గోవింద నను
రక్షించు ముకుంద  ॥ ॥

చరణములు:
కలి యుగ మనుజులు నీకు మహాత్మ్యము
కలదు లేదనే కాలమాయెగా ॥ రామ ॥

కాముని దాసులు నా పలుకుల విని
కావలసినటులనాడనాయె కదా ॥ రామ ॥

పామరులను కని సిగ్గు పడుచు మరి
మోము మరుగు జేసి తిరుగనాయెను ॥ రామ ॥

క్రొవ్వు గల నరుల కొనియాడగ చిరు
నవ్వులతో నను జూడనాయె కదా ॥ రామ ॥

మతి హీనులు శ్రీ పతి దాసులకీ
గతి రారాదని పల్కనాయె కదా ॥ రామ ॥

నమ్మినాడనే పేరుకైన నీ
తమ్మునితోనైన పల్కవైతివి ॥ రామ ॥

కార్యాకార్యము సమమాయెను నీ
శౌర్యమెందు దాచుకొంటివయ్యో ॥ రామ ॥

రాక రాక బ్రతుకిట్లాయెను శ్రీ
త్యాగరాజ నుత తరుణము కాదు ॥ రామ ॥

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...