Monday 10 April 2017

మత్స్యావతార కథ - 28:


8-741-మ.
ప్రళయాంభోనిధిలోన మేన్మఱచి నిద్రంజెందు వాణీశు మో
ముల వేదంబులుఁ గొన్న దైత్యుని మృతిం బొందించి సత్యవ్రతుం
డలరన్ బ్రహ్మము మాటలం దెలిపి సర్వాధారుఁడై మీనమై
జలధిం గ్రుంకుచుఁ దేలుచున్ మెలఁగు రాజన్మూర్తికిన్ మ్రొక్కెదన్.
8-742-వ.
అని చెప్పి.

భావము:
ప్రళయసముద్రంలో మైమరచి నిద్రించే బ్రహ్మదేవుడి ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన దుష్టరాక్షసుడిని సంహరించి, సత్యవ్రతుడు సంతోషించేటట్లు బ్రహ్మస్వరూపాన్ని తెలిపి, అన్నింటికి ఆధారుడవు అయి, మత్స్యావతారంతో సముద్రంలో మునుగుతూ తేలుతూ సంచారం చేసిన మహావిష్ణువునకు నమస్కారం చేస్తున్నాను.” అని ఈవిధంగా శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునకు చెప్పాడు.


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...