10.1-113-క.
స్నానముచేయఁగ రామిని
నానందరసాబ్ధిమగ్నుఁడై విప్రులకున్
ధేనువులం బదివేలను
మానసమున ధారవోసె మఱి యిచ్చుటకున్.
10.1-114-వ.
మఱియు వసుదేవుండు.
10.1-115-క.
"ఈ పురిటియింటి కుద్య
ద్దీపంబును బోలి చాల దీపించె నిజం
బీ పాపఁడు నలు మొగముల
యా పాపని గనిన మేటి యగు" నని భక్తిన్.
భావము:
స్నానం చేయడం వీలుకాకపోవుట చేత ఆనంద రసమనే సముద్రంలో మునిగి తేలుతున్న వసుదేవుడు బ్రాహ్మణులకు "పదివేల ఆవులు దానం చేస్తున్నాను" అని మానసికంగా ధారపోసాడు. ఇంకా వసుదేవుడు. ఇంకా వసుదేవుడు “పురిటింటికి దీపంలా వెలుగొందుచున్న ఈ పాపడు నిజానికి చతుర్ముఖ బ్రహ్మని కన్న మహానుభావుడు అయిన విష్ణుమూర్తే.” అని అనుకొన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=11&padyam=113
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment