Monday 25 May 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 2:

మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్దరించండి అని కోరాడు. అపుడు వారు మహర్షీ మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము. ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే; శ్రుతులకు గూడ అందని సచ్చిదానంద స్వరూపుడు; మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణమే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు.

ప్రతి సంవత్సరం మార్గశిర మాస పౌర్ణమి రోజున శ్రీ దత్త జయంతి జరుపుకుంటారు. మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర , కర్ణాటక మరియు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దత్త జయంతి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీ పాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ అక్కలకోట మహరాజ్ మరియు శ్రీ షిరిడీ సాయి బాబా మొదలగు అవతార పురుషులను శ్రీ దత్తాత్రేయుని అవతారాలుగా పరిగణిస్తారు.

కర్ణాటకలోని గాణుగాపూర్, మహారాష్ట్రలోని కారంజ, ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం ప్రసిద్ధ దత్త క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. రేపు శ్రీ దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల గురించి తెలుసుకుందాం.... ( ఇంకా వుంది )

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...