Wednesday 27 May 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 4:

కానీ ఙ్ఞానమూర్తి అయిన శ్రీపాదుడు  పెళ్ళికి ఏమాత్రం సమ్మతించలేదు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదు శ్రీపాదుడు. తరువాత తల్లిదండ్రుల అనుమతితో సన్యాసం స్వీకరించాడు శ్రీపాదుడు. కానీ సన్యాసానికి ముందు గుడ్డివాడు, కుంటివాడు అయినా తన ఇద్దరు సోదరులను తన లీలతో చూపును ప్రసాదించాడు మరియు ఇంకో సోదరుడి అవిటి తనాన్ని పోగొట్టాడు. వారిరువురికి ఙ్ఞానాన్ని ప్రసాదించి తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారిపై మోపి తాను తీర్థయాత్రలకై బద్రినాథ్ బయలుదేరాడు.

తీర్థయాత్రలు ముగించుకున్న శ్రీపాదుడు  దక్షిణాన కర్ణాటకలో గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నాడు. అటు తరువాత అక్కడి నుండి కృష్ణా నది జన్మస్థానమైన మహాబలేశ్వరం చేరుకున్నాడు. అక్కడ మూడు సంవత్సరాలు గడిపిన తరువాత శ్రీశైల పర్వతం చేరుకున్నాడు శ్రీపాదుడు. తరువాత అక్కడికి దగ్గరలోని కురువాపురం గ్రామానికి చేరుకున్నాడు శ్రీపాదుడు. తన జీవితంలోని ఎక్కువ భాగం ఈ ఊరిలోనే గడపడం విశేషం.

శ్రీ పాద వల్లభుల తరువాతి అవతార వైశిష్ట్యం మరియు లీలా విశేషాలు :

ఆ ఊరిలో అంబిక అనే పేరు బ్రాహ్మణ స్త్రీ నివసిస్తూండేది. ఆమెకు ఒక పుత్రుడు ఉండేవాడు. వాడు చెడు సాంగత్యం వలన పరమ నీచమైన పనులు చేస్తూ ఆ ఊరిలోని వారి చేత ఎప్పుడూ తిట్లు తింటూ ఉండేవాడు. ఇదిలా ఉండగా అంబిక భర్త తన పుత్రుడిని మార్చడానికి ఎంతగానో ప్రయత్నంచాడు, కానీ ఫలితం లేక కొన్ని రోజులకు బాధతో మరణించాడు.

భర్త తరువాత బిడ్డను మార్చటానికి అంబిక ఎంతో ప్రయత్నించింది. కానీ తను కూడా సఫలీకృతం కాకపోవడం వల్ల, ఊర్లో వారందరి చేత మాటలు పడడం కన్నా చావడం ఉత్తమమని తలచి, ఆత్మహత్య చేసుకుందామని కృష్ణా నది ఒడ్డుకు చేరుకున్నది అంబిక. కానీ నది ఒడ్డున కూర్చొని ఇదంతా గమనిస్తున్న శ్రీపాద వల్లభుడు తన దివ్యదృష్టితో అంతా తెలుసుకొని, ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా వారించే ప్రయత్నం చేశాడు. ఆత్మహత్య మహాపానమని అంబికను ఆపే ప్రయత్నం చేశారు శ్రీపాద వల్లభులు. అప్పుడు అంబిక తన బాధను అంతా శీపాదుల వారికి  తెలియజేసింది.

అంబిక భక్తితో శ్రీపాదుల వారితో ఇలా అంది " స్వామీ! నాకు జీవితం పైన వ్యామోహం ఏమాత్రం లేదు. ఉన్న ఒక్క కొడుకు కూడా ఇలా తయారయ్యాడు. నాకు జీవించాలని లేదు. కనీసం వచ్చే జన్మలో అయినా మీలాగా పరమ తేజోవంతుడైన కుమారుడు కలిగేలా ఆశీర్వదించండి!!!"  అని  ప్రాధేయపడింది.

అన్నీ తెలిసిన శ్రీపాదులు అప్పడు అంబికతో " అమ్మా! నీ ఇష్ట ప్రకారమే వచ్చే జన్మలో నీ సంతానంగా ' శ్రీ నృసింహ సరస్వతి' అను నామంతో మళ్ళీ జన్మిస్తాను. కానీ ఇప్పుడు ఓర్పు వహించు తల్లీ! " అని ఆమెకు వరాన్ని ప్రసాదించాడు. తరువాత ఆమె కొడుకు తలపై చేయి ఉంచి, వాడిని మహా ఙ్ఞానిగా మార్చారు శ్రీ పాదులవారు..... ( ఇంకా ఉంది )

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...