Sunday 21 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 12:

జగత్తుకూ, ప్రకృతికీ తానే గురువైనా మనందరిలో ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించడానికి జగద్గురువైన దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని 24  తత్త్వాలను తన గురువులుగా ప్రకటించుకున్నారు అవి...

1) ఆకాశం
2) భూమి
3) అగ్ని
4) జలం
5) వాయువు
6) సూర్యుడు
7) చంద్రుడు
8) పావురం
9) కొండ చిలువ
10) తేనెటీగ
11) భ్రమరం ( తుమ్మెద )
12) సముద్రం
13) రాబందు
14) సాలీడు
15) ఏనుగు
16) జింక
17) చేప
18) పసి పిల్లవాడు
19) కన్య
20) పాము
21) లోహపు పనివాడు
22) ఎలుగుబంటి
23) వేశ్య
24) చిమ్మట

ఇవన్నీ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు , పంచ తన్మాత్రలు, మిగిలిన నాలుగు మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారాలకు ప్రతీకలు. ఆ ఙ్ఞానమూర్తి అవ్యక్త రూపంలో వీటన్నిటిలో ఉన్నట్టుగా చెప్తారు.

ఈ ప్రకృతి తత్త్వాలను దత్తాత్రేయుడు ఎలా గురువుగా  స్వీకరించాడో రేపటి  నుండి తెలుసుకుందాం... ( ఇంకా వుంది )

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...