Sunday 22 March 2020

ధ్రువోపాఖ్యానము - 15


4-257-తే.
పద్మభవ సూనుఁ డుత్తానపాదు కడకు
నరిగి యా రాజుచే వివిధార్చనముల
నంది సంప్రీతుఁడై యున్నతాసనమున
నెలమిఁ గూర్చుండి యాతని వలను చూచి.
4-258-వ.
ఇట్లనియె.
4-259-క.
"భూనాయక! నీ విపుడా
మ్లానాస్యుఁడ వగుచుఁజాల మదిలోఁ జింతం
బూనుట కేమి కతం?" బన
నా నారదుతోడ నాతఁ డనియెన్ మరలన్.
4-260-క.
"మునివర! వివేకశాలియు
ననఘుఁడు నైదేండ్ల బాలుఁ డస్మత్ప్రియ నం
దనుఁ డదయుఁడ నగు నాచే
తను బరిభవ మొంది చనియెఁ దల్లియుఁ దానున్.

భావము:
నారదుడు ఉత్తానపాదుని దగ్గరకు వెళ్ళి, ఆ రాజు చేసిన నానావిధాలైన పూజలను అందుకొని, ఆనందంతో ఉన్నతాసనంపై కూర్చున్నవాడై ఆ రాజు వంక చూచి ఇలా అన్నాడు. “రాజా! నీ వదనసరోజం వాడి ఉన్నది. నీ మనస్సులోని విచారానికి కారణం ఏమిటి?” అని ప్రశ్నించిన నారదునితో ఉత్తానపాదుడు ఇలా అన్నాడు. “మునీంద్రా! నా ప్రియపుత్రుడు ధ్రువుడు ఐదేండ్లవాడు. మంచి తెలివితేటలు గలవాడు; పాపం ఎరుగనివాడు; అతనిని నేను దయమాలి అవమానించాను. అందుకు వాడు అలిగి తల్లితో పాటు వెళ్ళిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=260

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...