Saturday 20 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 11:

కారంజ క్షేత్రం మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో ఉన్నది. మనకు స్కంద పూరాణంలోని పాతాళ ఖండంలో ఈ క్షేత్ర వర్ణన కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో కారంజ మహర్షి ఉండేవారు. కారంజ వనంలో ఉండడం చేత పతంజలి మహర్షికి ఈ పేరు వచ్చింది. వశిష్ఠ మహర్షి శిష్యుడైన శ్రీ పతింజలి తన కుటీరంతో శిష్యగణంతో సహా ఉండేవారు.

ఈ కారంజ వనంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉండడం చేత గంగామాతకై మహర్షి ప్రార్థన చేయగా సంతసించిన రేణుకా దేవి అన్ని పవిత్ర నదుల నీటితో పావనమైన ఒక కుండాన్ని సృష్టించింది. ఈ కుండమే 'ఋషి తాలావ్' గా ప్రసిద్ధి చెందింది. అలాగే ఇక్కడ ప్రసిద్ధ 'బేంబ్లా' నది కూడా ఉద్భివిస్తుంది. జైనులకు కూడా ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది.

ఇక తరువాతి ప్రసిద్ధ దత్త క్షేత్రం గాణుగాపురం. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా అఫ్జల్ పూర్ తాలూకాలో ఉంది గాణుగాపురం. భీమా మరియు అమ్రజా నదుల ప్రవిత్ర సంగమ స్థలి అయిన ఈ క్షేత్రంలో స్వామివారి పాదుకలున్నాయి. అక్కడి నిర్గుణ మఠంలో ఉన్న ఈ పాదుకలను నిర్గుణ పాదుకలు అని కూడా అంటారు. ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం గురించి శ్రీ గురు చరిత్రలోని 49వ అధ్యాయంలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

స్వామి వారు చెప్పినట్టుగానే ఇక్కడ మధ్యాహ్న భిక్షకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడికి వచ్చిన భక్తులు తప్పకుండా కనీసం ఐదు ఇళ్ళలో మధ్యాహ్న భిక్ష స్వీకరించడం పరిపాటిగా మారింది. ఈ విషయాన్ని మనం శ్రీ గురుచరిత్రలోని 21 - 22 అధ్యాయాలలో తప్పక గమనించవచ్చు.....

గురుమధ్యే స్థిత౦ విశ్వ౦ విశ్వ మధ్యే స్థితో గురుః।  గురుర్విశ్వ౦ నచాన్యోస్తితస్మై శ్రీగురవే నమః॥

దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని 24 తత్త్వాలను తన గురువుగా స్వీకరించారు. వాటి తత్త్వ విచారాల గురించి రేపటి నుండి తెలుసుకుందాం......( ఇంకా వుంది )

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...