Friday 19 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 10:


శ్రీ స్వామివారి జీవిత విశేషాలను తెలుపుతూ  ప్రధాన శిష్యగణంలోని శ్రీసిద్ధ సరస్వతి స్వామివారు సంస్కృతంలో 'గురు చరిత్ర' గా పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్నే శ్రీ గంగాధర్ సరస్వతి గారు మరాఠీలోకి అనువదించారు. ఇది నిత్యపారాయణ గ్రంథం. గురు చరిత్ర గ్రంథరాజాన్ని తెలుగులో ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు అనువదించారు.

స్వామివారి అవతార సమాప్తి కూడా చాలా విచిత్రంగా జరిగింది. స్వామి వారు గాణుగాపురాన్ని వదిలి తన ఏడుగురు శిష్యులతో సహా భీమా మరియు ఆమ్రజా నదుల సంగమ స్థలికి చేరుకున్నారు. అక్కడి ప్రసిద్ధ అశ్వథ్ధ వృక్షాన్ని చూపిస్తూ స్వామివారు " ఈ వృక్షాన్ని భక్తితో పూజించి తపమాచరించండి, మీ కోరికలన్నీ తీరుతాయి, మీ జీవన్ముక్తి మార్గమౌతుంది " అని అన్నారు. తరువాత తన అవతార పరిసమాప్తి గురించి స్వామివారు తన శిష్యులకు వివరించారు.

బాధాతప్త హృదయాలతో శిష్యులు స్వామి వారికి అరటి ఆకులతో చిన్న తెప్పను తయారుచేసి దానిని పూలతో అలంకరించి, దాన్ని నదిలో ఉంచారు.... ఆ అరిటి తెప్పను అధిష్టించిన స్వామి తన చివరి ఆశ్వీర్వాదంగా గ్రామ ప్రజలను సంబోధించారు. శ్రీ స్వామి అక్కడి వారిని ఉత్సాహపరుస్తూ ఇలా అన్నారు " నేను ఈ తెప్ప మీద శ్రీశైలానికి దగ్గరలోని కదళీ వనానికి వెళుతున్నాను. నేను అక్కడ క్షేమంగా చేరాను అనడానికి చిహ్నంగా, ఈ నదీప్రవాహానికి ఎదురుగా పూలు తేలుతూ  కనిపిస్తాయి ".

స్వామివారు వెళ్ళే సమయానికి గ్రామ ప్రజలు అందరూ అక్కడికి చేరుకున్నారు. అందరూ స్వామివారిని సిద్ధంగా లేకపోవడంతో వారికి ధైర్యం చెబుతూ  స్వామి " బాధపడకండి! నేను నా భక్తులను విడిచి ఎక్కడికీ వెళ్ళను. భౌతికంగా కదళీ వనంలో ఉన్నా, నా స్వరూపం ఇక్కడే తిరుగాడుతూ  ఉంటుంది. నేను ప్రతీ రోజూ మధ్యాహ్నం మీ అందరి నుండే భిక్షను స్వీకరిస్తాను. ఇక్కడి నదిలో స్నానం చేసి, ఈ వృక్షాన్ని పూజించిన, నా పాదుకా దర్శనం చేసిన వారిని నేను తప్పక అనుగ్రహిస్తాను.

నిజంగానే స్వామి వారు శ్రీశైలం  చేరగానే అక్కడి నదిలో ప్రవాహానికి వ్యతిరేక దిశలో పూలు తేలిపైకి రావడం ప్రారంభమైంది.  ఇలా స్వామివారు తమ అంతిమ సమయంలో కూడా లీలావిశేషాలను చూపి అక్కడి వారిని అనుగ్రహించారు...... ( ఇంకా వుంది )

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...