Thursday 18 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 9:

కాశీకి చేరుకున్న నృసింహ సరస్వతి అక్కడ వివిధ దేవాలయాలను దర్శించిన పిమ్మట శ్రీకృష్ణ సరస్వతి స్వామిని తన గురువుగా స్వీకరించారు. తరువాత 1388వ సంవత్సరంలో సన్యాసాన్ని స్వీకరించారు. గురువైన కృష్ణ సరస్వతి స్వామి నరహరికి సన్యాసాశ్రమ నామంగా 'శ్రీ నృసింహ సరస్వతి' అని పేరు ఉంచారు.

సన్యాసము స్వీకరించిన తరువాత వివిధ పుణ్య క్షేత్రాలను దర్శించటానికి బయలుదేరారు స్వామి. అలా చాలా క్షేత్రాలు తిరిగి, 1416వ సంవత్సరంలో తిరిగి కారంజకు చేరుకున్నారు. అక్కడ తన పూర్వాశ్రమ తల్లీదండ్రులను కలిసి, మళ్ళీ 1418వ సంవత్సరం నుండి గోదావరి తీర ప్రాంత క్షేత్రదర్శనం ప్రారంభించారు. అలా 1420వ సంవత్సరంలో ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన పర్లీ వైద్యనాథ్ కు చరుకున్నారు.

అక్కడ ఒక సంవత్సరం పాటు నివసించి. మళ్ళీ 1421వ సంవత్సరంలో ఔదుంబర క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ కూడా ఒక సంవత్సరం పాటు ఉన్నారు. అక్కడ నుండి 1422వ సంవత్సరంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న అమరాపూరుకు చేరుకున్నారు. అక్కడ పన్నెండు సంవత్సరాల పాటు అనగా 1434వ సంవత్సరం వరకు ఉన్నారు. స్వామివారు అక్కడ చాలా కాలం ఉండడం చేత ఆ ప్రాంతానికి 'నరసిహవాడి' అని పేరు వచ్చింది. అదే కాలాంతరంలో 'నర్సోబావాడి'గా మారిపోయింది.

అక్కడ నుండి మళ్ళీ కర్ణాటకలోని గాణుగాపురానికి చేరుకున్నారు అక్కడ ఇరవైనాలుగు సంవత్సరాల పాటు అనగా 1458వ సంవత్సరం వరకు నివసించారు. ఈ క్రమంలోనే స్వామివారికి ప్రధాన శిష్యగణం తయారవడం విశేషం. వారే శ్రీమాధవ సర్వతి, శ్రీబాల సరస్వతి, శ్రీఉపేంద్ర సరస్వతి, శ్రీసదానంద సరస్వతి, శ్రీకృష్ణ సరస్వతి, శ్రీ సిద్ధ సరస్వతి, శ్రీ ధ్యానజ్యోతి సరస్వతి.... ( ఇంకా వుంది)

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...