Friday 17 July 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 27:


" మోక్షము కేవలం ఈ మానవ యోని వలన మాత్రమే సాధ్యమవుతుంది. అంతే తప్ప మిగిలిన ఏ యోనితోనూ మోక్షప్రాప్తి సాధ్యపడదు. అందుకే ఈ దుర్లభ మానవ జన్మను వృథా చేసుకోకూడదు. అందుకే నేను వైరాగ్యాన్ని స్వీకరించాను. నాకు దేని పైనా మోహము లేదు. దేనిపైనా అహం భావము కూడా లేదు " అని అంటాడు దత్తాత్రేయుడు.

ఈ ఇరవైనాలుగు గురువుల తత్త్వాలను శ్రీ కృష్ణుడు ఉద్ధవుడికి బోధించినట్టుగా శ్రీమద్భాగవతంలోని ఏకాదశ స్కంధంలోని ఏడవ ఘట్టంలో  కనిపిస్తుంది. అలాగే తెలుగులోని మన పోతన భాగవతంలో ఏకాదశలో స్కంధంలోని పన్నెండవ ఘట్టంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది. అందులో మనం చూసిన ప్రతీ ఒక్క కథతో పాటు, శ్రీ కృష్ణుడు ఉద్ధవుడికి బోధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి.

జగద్గురువైన దత్తాత్రేయుడు ఈ ఇరవైనాలుగు తత్త్వాలను మనకు ఙ్ఞాన బోధ చేయటానికే స్వీకరించాడు. ఏందుకంటే ఆయనే జగద్గురువు కాబట్టి. మనం కూడా ఙ్ఞానప్రదాలైన ఈ తత్త్వలను గ్రహించి ఆచరించే ప్రయత్నం చేద్దాం.
ఇన్ని రోజులూ అఙ్ఞానినైన నాతో తన వైభవాన్ని రాయించుకున్నాడు దత్తాత్రేయుడు. రాసింది నేనైనా రాయించింది ఆయనే.

ఈ పోస్టులను ఆదిరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అందరిపైనా దత్తాత్రేయుడు తన కృపాకటాక్షాలు కలుగుజేయాలని కోరుతన్నా... జై శ్రీ రామ....

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...