Monday 13 July 2015

గోదావరి మహా పుష్కరాలు - 2015:

( 14-07-2015 నుండి 25-07-2015 )

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. గోదావరి పుష్కరాలు 2015వ సంవత్సరం జూలై 14 నుండి 25వరకు జరగనున్నాయి.

పూర్వం తుందిలుడనే బ్రాహ్మణుడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ  పరమశివుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. పరమశివుడు తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానం కావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు.

ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలం కోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జలాలకు చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు .ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు.

అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి.

ప్రాముఖ్యం చెందిన పన్నెండు నదులకు పుష్కర సమయాలు వ్యాఖ్యానించ్చబడ్డాయి. పన్నెండేళ్ళకి ఒకసారొచ్చే పుష్కరాలు ఎలా నిర్ణయం చేస్తారంటే... గురు ఏ రాశిలో ఉంటే ఏ నది పుష్కషమో చెప్పవచ్చు....
మేష రాశి - గంగా నది పుష్కరము
వృషభ రాశి  - నర్మదా నది పుష్కరము
మిథున రాశి  - సరస్వతీ నది పుష్కరము
కర్కాటక రాశి  - యమునా నది పుష్కరము
సింహ రాశి - గోదావరి నది పుష్కరము
కన్య రాశి - కృష్ణా నది పుష్కరము
తుల రాశి - కావేరి నది పుష్కరము
వృశ్చిక రాశి - తామ్రపర్ణి నది పుష్కరము
ధనస్సు రాశి - సింధూ నది పుష్కరము
మకర రాశి - తుంగభద్ర నది పుష్కరము
కుంభ రాశి - భీమా నది పుష్కరము
మీన రాశి - ప్రాణహిత నది పుష్కరము

పుష్కర కాలానికి గల మరో విశిష్టత పితరుల సంస్మరణార్థం చేసే శ్రాద్ధ కర్మలు. పుష్కర సమయాల్లో దేవతలు, రుషులు వారితో పాటు పితరులు కూడా వస్తారనే ప్రమాణవాక్యం పుష్కర శాస్త్రాలలో పేర్కొనబడినది. ఇక్కడ చేసే శ్రాద్ధం వారికి తిండి పెడుతుందా? అనేది చాలామందిలో మెలిగే ధర్మసందేహం. కానీ మన కంటికి కనపడని కొన్ని పదార్థ గ్రాహకాలైన అణువులు ఇక్కడ మంత్రంతో కూడుకొని పెట్టే శ్రాద్ధ ద్రవంలోని ఆహార రసాన్ని మన పితరులకు అందిస్తుందంటారు. ఈ కర్మలను పరిపూర్ణ విశ్వాసంతో చేస్తే సత్ఫలితాన్ని పొందవచ్చు.

శాస్త్రోక్తమైన సంకల్పవిధానంతో పుష్కరస్నానం చేసి, స్నానఫలితాన్ని పొందండి. ముందుగా కొంచెం మట్టి లేక ఇసుక చేతిలోకి తీసుకొని నదివద్దకు చేరి ఈ క్రింది శ్లోకాలను చదువుతూ ఆమట్టిని కానీ ఇసుకని కానీ నదిలో కలపాలి.

1. పిప్పలాద మహాభాగ సర్వలోకశుభంకర
మృత్పిండం చ మాయా దత్తం ఆహారార్ధం ప్రకల్ప్యతామ్
2. పిప్పలాదాత్ నముత్పన్నే కృతే లోకే భయంకరే
మృత్తికాం తే మయా దత్తం ఆహారార్ధం ప్రకల్ప్యతామ్
ఆపై నదీ జలాన్ని మూడుసార్లు శిరస్సుపై "పుండరీకాక్ష , పుండరీకాక్ష , పుండరీకాక్ష" అనుచు చల్లుకోవాలి....

జై శ్రీ రామ... నమామి గౌతమి గంగే.... గోదావరీం నమోస్తుతే....

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...