Sunday 12 July 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 26:

24. ఇరవైనాలుగవ గురువు -  గొంగళి పురుగు:

గొంగళి పురుగు చిన్నగా ఉన్నప్పుడు దానిని పట్టుకున్న కందిరీగ దానిని తన గూటిలో దాచుకుని దానిని బంధించి దాన్ని కుడుతుంది. ఆ తరువాత దాని చుట్టే తిరుగుతూ  ఉంటుంది. అలా ఎందుకు తిరుగుంతుందో అర్థం కాక భయపడిన గొంగళి పురుగు కాసెపటికి తనను తాను కందిరీగగా భావించుకుంటుంది. ఆ గొంగళి పురుగు కూడా తరువాత క్రమంగా అలా అలా తను కూడా కందిరీగగా మారిపోతుంది.

ఎవరైనా పదే పదే ఒకరి గురించి ఆలోచిస్తూ, ఎప్పుడు వారి గుర్తులే మనసులో ఉంచుకొని పదే పదే వారిని స్మరిస్తుంటారో అలాంటి వారు కొన్నాళ్ళకి వారు ఎవరినైతే ఊహించుకుంటారో, తాము వారు ఒకటేనని భావిస్తారు. ఇలాంటి సంఘటనలు మనం చూసేవుంటాం. అలాగే సాధకుడు కూడా ఎప్పుడూ పరమాత్మను గురించి ఆలోచిస్తే తన పరమాత్మలో లీనమౌతాడు. అందుకే మనిషనే వాడు మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలంటాడు దత్తాత్రేయుడు.

ఇంకా ఈ ఇరవైనాలుగు గురువులనే కాకుండా తాను తన శరీరం నుండి కూడా చాలా విషయాలు నేర్చుకున్నానంటాడు. "శరీరము అనుభవించే జనన మరణ చక్రాల నుండి ఙ్ఞానము, వైరగ్యాలను నేర్చుకున్నాను. అందుకే ఈ శరీరంపై పెంచుకుంటే తరువాత బాధలు, దుఃఖాలు తప్పవంటాడు. ఈ శరీరంతో ఎన్నో పవిత్ర కార్యాలు చేయవచ్చు. కానీ నేను ఈ శరీరంపైన మక్కువ పెంచుకోను".

" ఈ శరీరాన్ని సుఖపెట్టటం ధనం సంపాదించాలి. ధనం కోసం కర్మలు చేయాల్సి ఉంటుంది. ఈ కర్మల వలన పాప, పుణ్యాల చక్రంలో చిక్కపోవడం ఖాయం. భగవంతుడు 84 లక్షల యోనులను పుట్టించినా సంతృప్తి పడక మానవ యోనిని సృష్టించాడు. ఈ యోనికి మోక్షమే నిజమైన లక్ష్యం....... ( ఇంకా వుంది )

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...