Tuesday 28 July 2015

శ్రీ జగన్నాథ వైభవం - 4:


ఏ ఆలయంలోనైనా గర్భాలయంలోని మూల విరాట్టు కరచరణాలతో, సర్వాలంకారాలతో, నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. కానీ పూరీలోని జగన్నాథుడు మాత్రం కరచరణాలు లేకుండా, కొలువుదీరి దర్శనమిస్తాడు. ఇదే ఆయన ప్రత్యేకత. ఈ ప్రత్యేకతకు ఓ కథ వుంది.

పూర్వం ద్వాపర యుగంలో భరతఖండాన్ని ఇంద్రద్యుమ్నుడనే మహారాజు పాలించేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు. ఒకసారి నారాయణుడు ఇంద్రద్యుమ్నుని కలలో కనిపించి, తన కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. ఇంద్రద్యుమ్నుడు మహావిష్ణువు ఆదేశాన్ని తన సకృతంగా భావించి, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే ఆలయంలో మూల విరాట్టు రూపాలు ఎలా వుండాలనే విషయంలో మాత్రం ఆలోచనలో పడ్డాడు.

ఎందుకంటే కలలో కనిపించిన విష్ణువు రూపాన్ని తాను శిల్పంగా మలచలేడు కాబట్టి. ఎందుకంటే శిల్పులు మహారాజు దర్శించిన రూపాన్ని శిల్పంగా మలచలేరు కదా, ఎందుకంటే వారికి నారాయణుని దర్శనం కలుగకపోవడమే అసలు విషయం. ఈ విషయంలో మహారాజుకు చింత రోజురోజుకీ పెరిగిపోసాగింది. తన భక్తుడు పడుతున్న ఆవేదన సకలలోక రక్షకుడైన నారాయణుడికి అర్థమయ్యి, తానే ఒక శిల్పి రూపమును ధరించి, ఇంద్రద్యుమ్న మహారాజు దగ్గరకు వచ్చాడు.

మహారాజు దగ్గరకు వచ్చన శిల్పి, మహారాజుతో " అయ్యా! మీకు సంతృప్తి కలిగే విధంగా మూలవిరాట్టు నిర్మాణం చేస్తాను, అయితే విగ్రహ తయారీకి 21 రోజుల సమయం పడుతుంది. అయితే నా పని పూర్తి అయ్యేంత వరకు, ఎవరూ కూడా నా గదిలోకి రాకూడదు. నాకు నేనుగా బయటకు వచ్చేవరకు, నా యొక్క పనికి ఎవరూ కూడా అంతరాయం కలిగించకూడదు" అని నిబంధన విధించాడు. మహారాజు అందుకు సమ్మతించాడు.

ఒక ఏకాంత మందిరంలో నారాయణుడైన మాయాశిల్పి తన పని ప్రారంభించాడు. వారాలు, నెలలు గడుస్తున్నాయి. మందిరంలో పని జరుగుతున్నట్టు శబ్దాలు వస్తూనే వున్నాయి. పని జరగుతూనే ఉంది. కానీ మూలవిరాట్టు రూపాన్ని చూడాలనే ఆత్రుత, మహారాజు దంపతులకు ఎక్కువ కాసాగింది.
కొన్ని రోజుల తరువాత ఆ మందిరం నుంచి శబ్దాలు రావడం మానేశాయి.... ( ఇంకా వుంది )

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...