Wednesday 29 July 2015

శ్రీ జగన్నాథ వైభవం - 5:

రాజ దంపతులకు ఆతృతతో పాటు అనుమానం కూడా ఎక్కువైంది. నిద్రాహారాలు లేకుండా ఆ మందిరంలో పని చేస్తున్న శిల్పి బహుశా మరణించి వుంటాడేమోనని సందేహం కలిగింది. ఇక ఓపిక నశించిన మహారాజు శిల్పి పెట్టిన నియమాన్ని ఉల్లఘించి ఆ ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశంతో నియమభంగం అయిందని గుర్తంచిన శిల్పి మరుక్షణంలో మాయమయ్యాడు. అక్కడ దర్శనమిచ్చిన మూడు మూర్తులను చూసి, ఆశ్చర్య పోయాడు ఇంద్రద్యుమ్నుడు.

కరచరణాదులు లేకుండా, వున్న ఆ మొండి విగ్రహాలను ఆలయంలో ఎలా ప్రతిష్ఠించాలా అనే సందేహం ఆయనకు మరింత బాధను కలిగించింది. అదే రోజు రాత్రి బాధతో ఉన్న ఇంద్రద్యుమ్నునికి కలలో కనిపించి "రాజా! బాధపడకు. ఇదంతా నా సంకల్పమే. ఈ శిల్పాలనే ఆలయంలో ప్రతిష్ఠించు. నేను ఈ రూపాలతోనే కొలువుతీరి జగన్నాథుడు అనే పేరున జనులందరి కోరికలూ తీరుస్తూ వుంటాను '' అని పలికాడు. ఇంద్రద్యుమ్నుడు ఈ మూర్తులనే ఆలయంలో ప్రతిష్ఠించాడు. అవే నేటికీ సర్వజనుల చేత పూజలందుకుంటున్న బలభద్ర, సుభద్ర, జగన్నాథ మూర్తిత్రయం.

అవయవ లోపంగల విగ్రహాలు అర్చనకు అనర్హమంటారు.కానీ నీలాచలం క్షేత్రంలో అదే ప్రత్యేకత. ఆ తరువాత క్రీ.శ. 1140లో అప్పటి రాజు అనంతవర్మ చోడగంగాదేవ్ నూతన మందిరం నిర్మించగా, అనంతరకాలంలో శిథిలమైన దానిని ఆయన మనువడు అనంగ భీమదేవుడు పునర్నిర్మించారు. ఆ తర్వతి కాలంలో అనగా క్రీ.శ.1174లో ఒడిషాను పరిపాలించిన అనంగ భీమదేవుడు ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం పూరీ క్షేత్రంలో దర్శనమిస్తున్న జగన్నాథస్వామి ఆలయ సంపద అంతా అనంగ భీమదేవుని కాలంలో నిర్మించినవే.

సాధారణంగా ఏ ఆలయంలోనైనా భగవంతుడు భార్యాసమేతుడై కొలువుతీరి వుంటాడు. కానీ పూరీ క్షేత్రంలోని జగన్నాథుడు మాత్రం తన సోదరుడు బలభద్రుడుతోనూ, సోదరి సుభద్రతోనూ, కొలువుదీరి సేవలు అందుకొంటూంటాడు. సుమారు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన జగన్నాథుని ఆలయంతోపాటు వినాయకునికి, లక్ష్మీ, పార్వతులకు, శివునకు, నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు వున్నాయి..... ( ఇంకా వుంది )

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...