Monday 24 January 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౯(459)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-982-తే.
అట్లు గూర్చుండఁ బెట్టి నెయ్యమునఁ గనక
కలశ సలిలంబుచేఁ గాళ్ళు గడిగి భక్తిఁ
దజ్జలంబులు దనదు మస్తమునఁ దాల్చి
లలిత మృగమద ఘనసార మిళిత మైన.
10.2-983-తే.
మలయజము మేన జొబ్బిల్ల నలఁది యంత
శ్రమము వాయంగఁ దాళవృంతమున విసరి
బంధురామోదకలిత ధూపంబు లొసఁగి
మించు మణిదీపముల నివాళించి మఱియు. 

భావము:
అలా కుచేలుడిని కూర్చుండ బెట్టి, పిమ్మట శ్రీకృష్ణుడు బంగారు కలశంలో నీళ్ళు తీసుకు వచ్చి ఆయన పాదాలను కడిగాడు. ఆ జలాన్ని భక్తితో శిరస్సు మీద చల్లుకున్నాడు. పిమ్మట మనోహర మైన కస్తూరి, పచ్చకర్పూరపు మైపూతలు తీసుకుని ఆ మనోజ్ఞ మైపూతలు కుచేలుని శరీరానికి ప్రీతితో అలది, మార్గాయాసం తీరేలా స్వయంగా ఆప్తమిత్రుడు కుచేలునికి విసన కఱ్ఱతో విసిరాడు. అగరధూపం వేసి, మణిమయ దీపాలతో నివాళులు అర్పించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=983 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...