అదే గ్రామంలో శ్రీపాద వల్లభుల పరమ భక్తుడైన ఒక చాకలివాడు ఉండేవాడు. కానీ ఆ చాకలివాడు చాలా బీదవాడు. ఆయన ప్రతీ రోజు శ్రీ పాద వల్లభుల వారి బట్టలు ఉతకడం ద్వారా వారికి ఎల్లవేళలా సేవ చేస్తూండేవాడు. కానీ ఒక రోజు #కృష్ణా నదిలో అక్కడి సుల్తాను తన రాజపరివారంతో కలిసి నావల్లో వెళ్ళడం చూసాడు ఈ చాకలివాడు.
ఆ సుల్తాను యొక్క రాజసం, ఐశ్వర్యం, ఠీవిని చూసి ఆశ్చర్యపడ్డాడు. కానీ అలా చూస్తూ తన బీదత్వానికి చాలా బాధపడ్డాడు. విషయం తెలిసిన శ్రీపాద వల్లభులు ఆ చాకలివాడిని ఏమైందని అడగగా ఆ చాకలివాడు " నాకు అలా రాజుగా పుట్టి సకల సుఖాలు అనుభవించాలని ఉంది స్వామి! " అని బదులిచ్చాడు. అప్పుడు శ్రీపాదుల వారు ఆ చాకలివాడికి వచ్చే జన్మలో రాజుగా పుట్టమని వరమిచ్చారు.
కానీ ఆ చాకలివాడు సంతృప్తిపడక #శ్రీపాదుల వారితో " స్వామి! కానీ వచ్చే జన్మలో మిమ్మల్ని చూడకుండా, మీ సేవాభాగ్యం నుంచి వచింతుడనై, నేను ఉండగలనా? " అని బాధపడ్డాడు. కానీ అప్పుడు శ్రీ పాదుల వారు ఆ చాకలివాడితో " వత్సా! బాధపడకు. వచ్చే జన్మలో నేను నృసింహ సరస్వతిగా జన్మంచినప్పుడు నన్ను కలుస్తావులే! " అని బదులిచ్చారు.
ఈ చాకలివాడే తరువాతి జన్మలో బీదరు సుల్తాను అల్లాఉద్దీన్ రెండు గా జన్మించారని నానుడి.
అదే ప్రాంతంలో వల్లభేషుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వ్యాపారం చేస్తూండేవాడు. తన వ్యాపారంలో బాగా లాభాలు వస్తే కురవాపురం వచ్చి వేయి మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తానని భగవంతుణ్ణి వేడుకున్నాడు. అలా అదే సంవత్సరం ఆయనే తన వ్యాపారంలో చాలా లాభాలను గడించాడు. అనుకున్నట్టుగానే చాలా ధనంతో కురవాపురం బయలుదేరాడు.
కానీ అది బందిపోట్లు బెడద అధికంగా ఉండే దారి. వల్లభేషుడు ధనంతో వెళుతున్నాడని సమాచారం తెలిసిన బందిపోట్లు ఆయనపై దాడిచేసి ఆయన తలనరికి చంపేశారు..... ( ఇంకా వుంది )
No comments:
Post a Comment