Thursday 23 June 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౪(574)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1198-వ.
చనుదెంచిరి; పుణ్యస్థలంబులును, విప్రులును, దేవతలును సంస్పర్శన దర్శనార్చనంబులం బ్రాణులను సమస్త కిల్బిషంబులం బాయంజేయుదు; రదియునుంగాక, బ్రాహ్మణుండు జననమాత్రంబున జీవకోటి యందు ఘనుండై యుండు, జపతపోధ్యానాధ్యయనాధ్యాత్మములం జతురుండై మత్కలాశ్రయుండయ్యెనేని నతం డుత్తముం డై వెలుంగు; నతనిం జెప్ప నేల?” యని వెండియు నిట్లనియె.

భావము:
అంతటి మహానుభావులు నీ ఇంటికి విచ్చేసారు. పుణ్యస్థలాలూ, విప్రులూ, దేవతలూ, స్పర్శ, దర్శన, అర్చన వలన జీవుల పాపాలు సమస్తమూ తొలగిస్తారు. బ్రాహ్మణుడు పుట్టుకతోనే సకల జీవులలోను గొప్పవాడు అయి ఉంటాడు. అతడు జపము, తపస్సు, ధ్యానము అధ్యయనము మున్నగు సాధనలతో పరిపూర్ణుడై నా భక్తుడు అయితే గొప్పగా ప్రకాశిస్తాడు.” అని పలికి కృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1198

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...