Tuesday 19 October 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౦(370)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-774-క.
అదిగాక యిందిరావిభు
పదములు సేవించునట్టి భాగ్యము గలుగం
దుదిఁ బడయరాని బహు సం
పద లెవ్వియుఁ గలవె?" యనుచుఁ బ్రస్తుతి సేయన్.
10.2-775-వ.
అప్పుడు.
10.2-776-చ.
అమరసమానులై తనరు యాజకవర్గములోలి రాజసూ
యమఖవిధానమంత్రముల నగ్నిముఖంబుగఁ జేసి ధర్మజుం
గ్రమమున వేలిపింపఁ గ్రతురాజసమాప్తిదినంబునన్ నృపో
త్తముఁడు గడంగి యాజకసదస్య గురుద్విజకోటిఁ బెంపునన్. 

భావము:
అంతేకాకుండా, “శ్రీకృష్ణుడి పాదపద్మాలు పూజించే భాగ్యం పొందిన వారికి, పొందలేని దంటూ ఏదీ ఉండదు” అని బ్రహ్మాదులు ప్రస్తుతించారు. అంతట దేవతలతో సమానులైన ఋత్విక్కులు రాజసూయ యాగానికి అనువైన మంత్రాలతో హవ్య ద్రవ్యాలను ధర్మరాజుచేత వేలిపించి యాగాన్ని నడిపించారు. ధర్మరాజు ఋత్విక్కులనూ, సభాసదులనూ, పెద్దలనూ, బ్రాహ్మణులనూ యజ్ఞం పరిసమాప్తమైన చివరిదినం పూజించాలని భావించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=776 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...